తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ మరో పక్షం రోజుల్లో కొత్త పార్టీని స్థాపించడం ఖాయమని గాంధేయ ఉరుమై ఇయక్కం అధ్యక్షుడు తమిళురువి మణియన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలికాలంలో తాను రెండుసార్లు రజనీకాంత్తో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఆయనకు ఎంతో గౌరవమర్యాదలతోపాటు.. ప్రేమాభిమానాలు ఉన్నాయని మణియన్ చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేందుకు కాదని, తనను పెంచి పోషించిన ప్రజలకు తనకు చేతనైన మేలు చేయాలన్న ఉద్దేశంతోనేనని చెప్పారు. మరో పక్షం రోజుల్లో రజనీ కచ్చింతగా రాజకీయ పార్టీని ప్రాంభిస్తారని, పార్టీ స్థాపనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశాక తన సిద్ధాంతాలు, ఆశయాలను వెల్లడించే అవకాశం ఉందని మణియన్ పేర్కొన్నారు.