ఓ వ్యక్తి శోభనం రాత్రి నుంచే తన భార్యను దూరం పెట్టాడు. హనీమూన్కు వెళితే అక్కడ కూడా అతడు తన భార్యతో శృంగారానికి ఆసక్తి చూపలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆ మహిళ మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడంటూ భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్కోట్లో వెలుగుచూసింది.
రాజ్కోట్కు చెందిన పరిణీత అనే యువతికి ఫిబ్రవరి 9, 2018న పెద్దల సమక్షంలో ఓ డాక్టర్ తో వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో పడక గదిలోకి అడుగుపెట్టిన ఆమెకు మొదటి రాత్రే చేదు అనుభవం ఎదురైంది. తొలిరాత్రి ఆమెతో శృంగారం చేసేందుకు భర్త తిరస్కరించాడు. ఆ తర్వాత ఎప్పుడూ ఆమె కలిసేందుకు ప్రయత్నించినా దూరం జరిగేవాడు. ఏవేవో సాకులు చెప్పి శృంగారానికి దూరంగా ఉండేవాడు. భర్త ప్రవర్తన ఇలా ఉందని పరిణీత తన అత్తతో చెప్పడంతో హనీమూన్కు వెళ్లమని సూచించారని, హనీమూన్కు వెళ్లిన తర్వాత కూడా తన భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదని పరిణీత ఫిర్యాదులో పేర్కొంది.
హనీమూన్ కు వెళ్లినప్పుడు ‘నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నాకు మరో మహిళతో సంబంధం ఉంది. నీకు ఎప్పటికీ దగ్గర కాలేను’ అని తన భర్త చెప్పాడని పరిణీత ఫిర్యాదులో పేర్కొంది. తన ల్యాప్టాప్లో గే పోర్న్ వీడియోలు, లెస్బియన్ పోర్న్ వీడియోలు చూసే వాడని చెప్పింది. అంతేకాకుండా తనతో పనిచేసే లేడీ డాక్టర్ కు ఆ వీడియోలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను పంపేవాడని చెప్పింది. ఆమె కూడా తన న్యూడ్ ఫోటోలను తన భర్తకు పంపేదని, ఆమె అలా పంపిన ఫొటోలు, వీడియోలు చూసి తన భర్త హస్త ప్రయోగం చేసుకునేవాడని పరిణీత ఫిర్యాదులో పేర్కొంది. ఇదేంటని నిలదీస్తే.. తనను తిట్టి, కొట్టి హింసించాడని పరిణీత ఫిర్యాదు చేసింది.