విశాఖ జిల్లా పెదబయలు మండలం అరడకోట పంచాయితీ చుట్టూమెట్ట వద్ద జీపు బోల్తా పడి 12 మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పాడేరు నుంచి పెదబయలు వైపు వెళ్తున్న జీపు చుట్టూమెట్ట వద్దకు వచ్చేసరికి అక్కడ ఉన్న మలుపు వద్ద అదుపుతప్పి చెట్టును డీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మిగతా 10 మందికి స్వల్ప గాయాలు తగిలాయి. వీరిని పెదబయలు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.