ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరితో ప్రేమాయణం..లాటరీ తీసి ఒకరితో పెళ్లి

national |  Suryaa Desk  | Published : Mon, Sep 06, 2021, 01:59 PM

ఓ యువకుడు వేర్వేరు ప్రాంతాల్లోని ఇద్దరు యువతులతో ప్రేమాయణం కొనసాగించాడు. ఆ ఇద్దరు యువతులు అతడు లేకుండా ఉండలేమన్నారు. దీంతో ఆ ఊరి పెద్దలు చివరకు లాటరీ పద్దతిలో ఒకరిని ఎంపిక చేసి ఆ యువకుడితో పెళ్లి జరిపించారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన జిల్లాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. హాసన జిల్లా సకలేశపుర ప్రాంతానికి చెందిన యువకుడు సోషల్ మీడియా ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని ఇద్దరు యువతుల్ని ప్రేమలోకి దింపాడు. ఆ ఇద్దరు యువతులు ఆ యువకుడిని ఇషటపడ్డారు. అతడ్ని పెళ్లి చేసుకునేందుకు ఇద్దరూ ఒప్పుకున్నారు. అయితే ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో ఆ యువకుడికి అర్థం కాలేదు. దీంతో గ్రామ పెద్దలు పంచాయితీ చేసినా ఫలితం లేకపోయింది. ఆ పరిస్థితుల్లో ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొంది ఇటీవలే కోలుకుంది.


దీంతో శుక్రవారం మరోసారి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వ్యవహారం తెరమీదకు వచ్చింది. గ్రామస్థులు లాటరీ ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని, ఎంపికైన యువతికి ఆ యువకుడితో వివాహం జరిపిస్తామని చెప్పారు. లాటరీ తీయగా అందులో విషం తాగిన యువతి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వారికి వివాహం జరిపించారు. లాటరీలో పేరు రాని యువతి తన పోటీదారుతో మాట్లాడుతూ ‘మీ వివాహ జీవితం సంతోషంగా కొనసాగాల’ని కోరుకుంటున్నట్లు చెపింది. కానీ తనను మోసం చేసిన ఆ యువకుడిని మాత్రం అంత ఈజీగా వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com