ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ప్రశ్నలకు దేశం పరేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2017, 05:05 PM

 నంద్యాలలో జగన్‌ సభ తెలుగుదేశం నాయకులను కకావికలం చేసింది. జగన్ నంద్యా ప్రజలకు హామీల వర్షం కురిపించారు.   దుర్మార్గమైన పరిపాలనను అందిస్తున్న చంద్రబాబును ఏం చేయాలో చెప్పాలని ప్రజలను సభ ప్రాంగణం నుంచి జగన్  అడిగారు . నంద్యాలను జిల్లా చేయాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఆ కలను సాకారం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో  జనంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి  


 ఎమ్మెల్సీ చేత రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నామని , మరి మీరు ఎందు రాజీనామా చేయించలేదని జగన్ ప్రశ్నించారు.   కొన్ని రోజుల ముందు ఏర్పాటు చేసిన చంద్రబాబు సభకు పెద్దగా జనం రాకపోవడం.. జగన్‌ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన అశేషజనాన్ని చూసి వారికి మతులుపోయాయి. జగన్‌ ప్రసంగం నంద్యాల సభకు హాజరైన అశేష జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది..   ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాల్సిందిగా వైశ్యులు విజ్ఞప్తి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. తమ డిమాండ్‌ను నెరవేర్చడానికి జగన్‌ ముందుకు రావడంతో ఆ వర్గాలలో ఆనందం వ్యక్తమౌతోంది 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com