ఢిల్లీ: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాలకు జీఎస్టీ మినహాయింపు, పన్ను రేటు తగ్గింపుపై చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మినహాయింపుపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్, ఆంద్రప్రదేశ్ నుంచి మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు.