మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన వేర్పాటువాద నేతలను ఎన్ఐఎ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏడుగురు వేర్పాటువాద నేతలను తరలించారు. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలతో రెండు సంస్థలకు చెందిన ఏడుగురిని ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురికి కోర్ట్ సెప్టెంబర్ 1 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మిగతా నలుగురిని ఈ నెల 14 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది.