ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు హాకీ టీంలు సెమీస్‌కు వెళతాయని ముందే ఊహించా : కిరణ్‌ రిజుజు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 02, 2021, 12:12 PM

తొలిసారిగా సెమీస్‌లోని దూసుకెళ్లిన మహిళల హాకీ జట్టు బృందానికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు అభినందనలు తెలిపారు. సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రత్యర్ధి జట్టు ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో భారత జట్టు విజయం సాధించి సెమీస్‌కు వెళ్లింది. కాగా, పురుషుల హాకీ టీం కూడా ఆదివారం సెమీస్‌కు వెళ్లింది. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన మాజీ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ మాట్లాడుతూ....' ఇది భారత్‌కు గొప్ప రోజు. హాకీలో మహిళల, పురుషుల జట్లు రెండూ సెమీస్‌కు చేరుకున్నాయి. ఇది పెద్ద విజయం. ఈ రెండు టీంలు బెంగళూరులో ఉన్నప్పుడు... వారిని కలిసేందుకు వెళ్లాను. వారితో మాట్లాడినప్పుడు... రెండు టీంలు సెమీస్‌కు వెళతాయని ఊహించా. ఇంకా రెండు దశలు మిగిలే ఉన్నాయి. అయినప్పటికీ సెమీ ఫైనల్స్‌ చేరుకోవడం గొప్ప విజయమ'ని అన్నారు. 49 సంవత్సరాల తర్వాత పురుషుల హాకీ టీం సెమీస్‌కు చేరుకుందని, ముందు మరింత క్లిష్ట దశలున్నాయని అన్నారు. అయితే సెమీస్‌ చేరుకోవడం పెద్ద విషయమేనని, సంబరాలు చేసుకోవాల్సిందేనని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com