అన్న తిట్టడంతో మనస్తాపానికి గురైన ఓ నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండల పరిధిలోని వక్కలగడ్డ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. మెరైన్ కానిస్టేబుల్ గొరిపర్తి పాండు రంగారావు కుమార్తె నాగ భార్గవికి (20) పదిహేను నెలల క్రితం హైదరాబాద్లో చార్డెడ్ అకౌంటెంట్గా పని చేసే నెరుసు సాయి శంకర్తో పెళ్లి జరిగింది. భార్గవి గర్భం దాల్చటంతో పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో నాగభావర్గవితో ఆమె అన్న నిఖిల్ గొడవ పడేవాడు. ఆదివారం సాయంత్రం వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నాగభార్గవి వంటింట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం నాగభార్గవి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు నాగభార్గవి తల్లి నాగలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.