శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బొడ్డగూడ వద్ద విషాదం చోటుచేసుకుంది. బొడ్డగూడ వద్ద ఇద్దరు బాలికలు నేలబావిలో పడి మృతిచెందారు. గ్రామానికి చెందిన బాలికలు ఇద్దరు కీర్తి, అంజలి.. తాగునీటి కోసం స్థానిక కోటకొండ దగ్గర్లోని నేలబావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో జారిపడి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలికలు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.