ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మళ్లీ అక్కడ పగటి పూట కర్ఫ్యూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 20, 2021, 05:07 PM

ఏపీలో నైట్ కర్ఫ్యూను సైతం మరికొన్ని రోజులు పెంచుతూ ఇప్పటికే ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మరో వారంపాటు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ముఖ్యంగా పి.గన్నవరం మండలంలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ కఠిన కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించారు. పి.గన్నవరంలో కరోనా విజృంభిస్తోంది. మండల వ్యాప్తంగా పాజిటివ్ రేటు శాతం పెరుగుతోంది. దీంతో అధికారులు మరో వారం రోజల పాటు కర్ఫ్యూ విధించారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరిచేందుకు.. ప్రజలకు బయటకు వెళ్లేందుక అనుమతి ఇవ్వనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్ఫ్యూ విధించామని మండల తహశీల్దార్ మృత్యుంజయరావు అధికారికంగా ప్రకటించారు. రేపటి నుండి వారం రోజులు కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com