బస్సు - ట్రక్కు ఢీ కొన్న ఘటనలో 30 మది దుర్మరణం పాలైన ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్సులోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. సిలాకోట్ నుంచి రాజన్ పూర్ కు బస్సు వెళ్తుండగా ఇండస్ రహదారిపై తౌన్సాబైపాస్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రాణాలు కోల్పోగా మరో 40 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.