తిరుమల: చంద్రగ్రహణం కారణంగా ఈనెల 7న సాయంత్రం 4.30 నుంచి 8న తెల్లవారుజామున 2 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు జేఈవో తెలిపారు. గ్రహణం సమయంలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో అన్నప్రసాద వితరణ ఉండదని చెప్పారు. రెండు కాలిబాట మార్గాల్లో భక్తుల సందేహాల నివృత్తికి సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.