విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త మైలు రాయిని లిఖించబోతుంది. గురువారం నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా 3360 మీటర్ల కొత్త రన్ వే పనులు విస్తరణ పూర్తి చేశామని, గతంలో 2286 మీటర్ల రన్ వే ఉండగా అదనంగా 1074 మీటర్ల విస్తరించారు. ఇప్పటివరకు కేటగిరీ -సి రాకపోకలు సాగించాయని, రన్ వే అందుబాటులో రావటంతో పెద్ద బోయింగ్ విమానాలు 777, 747, ఎయిర్ బస్ - 30 సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. దుబాయ్, సింగపూర్ సర్వీసులు ప్రారంభం అవుతాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.