ఢిల్లీ: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎం జగన్కు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. తక్షణమే కాపులకు ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాలలో కాపుకులస్తులే 50 శాతం ఉంటారని.. దీనికి మిగిలిన కులాలవారు అభ్యంతర పెట్టరని రఘురామ పేర్కొన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. స్పష్టత కోసం న్యాయస్థానాలకు వెళితే మనపై విశ్వాసం పెరుగుతుందన్నారు.