లక్నో : బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని అమిత్ షా అన్నారు. తాను ఆ పదవిలో ఎంతో సంతోషంగా, మనస్ఫూర్తిగా పనిచేస్తున్నానని చెప్పారు. రాజ్యసభకు ఎన్నికైతే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలకు ఆయన ఫుల్స్టాప్ పెట్టారు. బీహార్లో మూడు రోజులు పర్యటించేందుకు ఆయన శనివారం ఇక్కడకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా సోమవారం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బీహార్లో ఏ పార్టీని బిజెపి చీల్చలేదని చెప్పారు. అవినీతి పరులతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడనం దువలనే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. అటువంటి వారిని పదవిలో కొనసాగాలని తాము బలవం తం చేయలేమన్నారు. పార్టీ అధ్యక్షుడిగా పని చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. 2019లో జరిగే లోక్సభ ఎన్నికల్లో బిజెపి మరింత బలంతో అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు.