ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని పదవి కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్(నవాజ్) తరఫున షహీద్ ఖాకన్ అబ్బాసీ నామపత్రం సమర్పించారు. ఉమ్మడి అభ్యర్థిని నిలపడంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అయిదుగురు నామపత్రాలు దాఖలు చేశారు. దిగువసభ నేషనల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 342 కాగా, విజయం సాధించడానికి 172 ఓట్లు రావాల్సి ఉంది. నవాజ్ పార్టీ, మిత్ర పక్షాలకు 209 సీట్లు ఉండడంతో అబ్బాసీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.