ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా కల్లోలంలో గుడ్ న్యూస్

national |  Suryaa Desk  | Published : Sat, May 22, 2021, 11:22 AM

 దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం.. రికవరీలు పెరగడంతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,57,299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 4,194 మంది మృతి చెందారు.


దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,62,89,290 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 29,23,400 యాక్టివ్ కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లో 3,57,630 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 2,30,70,365కి చేరింది. అటు 2,95,525 మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు.నిన్న ఒక్క రోజులో దేశంలో 20,66,285 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా ఇప్పటివరకు 32,64,84,155 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా బులిటెన్‌లో వెల్లడించింది. అటు ఇప్పటిదాకా దేశంలో 19,33,72,819 మందికి వ్యాక్సినేషన్ జరిగినట్లు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com