హైదరాబాద్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ ఆర్డర్ కాపీలు మిలటరీ హాస్పిటల్కు అందాయి. షూరిటీలు దాఖలు చేసి బెయిల్ కాపీలు జైలుకు అందాల్సి ఉంది. జైలుకు కాపీలు అందిన తర్వాత బెయిల్ ఫార్మాల్టీస్ మొదలుకానున్నాయి. ఇంకా జ్యూడిషియల్ కస్టడీలోనే రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. మిలటరీ ఆస్పత్రిలో జైలు సిబ్బంది నిఘాలో రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. జైలు నుంచి హాస్పిటల్లో సిబ్బందికి ఆర్డర్ కాపీలు అందాల్సి ఉంది.అప్పుడే రఘురామ కృష్ణంరాజు బెయిల్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.