పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీపోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అయితే నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని రఘురామ తరపున న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ పిటిషన్పై శనివారం మధ్యాహ్నం విచారణ జరపనుంది న్యాయస్థానం. విచారణ పూర్తయ్యే వరకు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చవద్దని హైకోర్టు తెలిపింది. సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న రఘురామ కృష్ణరాజుకు ఆహారం, వైద్యం, వసతి తదితర సదుపాయాలు కల్పించాలని పేర్కొంది.
అలాగే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారన్న అభియోగంపై ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయనను గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. రఘురామను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఆయనపై ఐపీసీ 124 (A), 153(A), 505, 124A, 120 (b) of IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.