ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ఫ్యూ అమలు బాధ్యతలను కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. కర్ఫ్యూ లేని సమయంలో 144 సెక్షన్ అమలు చేసి ప్రజలు ఎక్కువ మంది గుమికూడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ సమయంలో వేటిపై ఆంక్షలు ఉన్నాయి. వేటికి మినహాయింపు ఉందో ఓ సారి చూద్దాం.
ఆంక్షలు:
*కర్ఫ్యూ సమయంలో వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, దుకాణాలు, సంస్థలు అన్నీ మూసివేయాలి.
మినహాయింపులు:
*ఉదయం 6 నుంచి 12 గంటల వరకు దుకాణాలు, వ్యాపారాలకు అనుమతి ఉంటుంది.
*ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్లు, మెడికల్ షాపులు
*ప్రింట్ –ఎల్రక్టానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, ఐటీ సేవలు
*పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ ఔట్లెట్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు
*నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, కోల్డ్ స్టోరేజీలతోపాటు గిడ్డంగులు
*ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, అన్ని ఉత్పాదక సంస్థలు
*వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతో పాటు అన్ని వ్యవసాయ పనులు
*డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు) గుర్తింపు కార్డు ఉంటే అనుమతి ఇస్తారు
*ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ పంస్థలో పని చేసే వారు డ్యూటీ పాస్ తో కర్ఫ్యూ టైమ్ లోనూ తిరగవచ్చు.
*రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి టికెట్ ఉంటే అనుమతి ఇస్తారు.
*వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్ టీకాలకు వెళ్లే వ్యక్తులు
*ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి
*అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తారు.
*పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతి. ఇందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.