ఐసీసీ టీ20 వరల్డ్ కప్ను ఇండియా నుంచి యూఏఈకి తరలించడానికి బీసీసీఐ సిద్ధమైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ఉంటుందని నిపుణుల అంచనా వేస్తుండగా.. అలాంటి పరిస్థితుల్లో భారత్ కు వచ్చి క్రికెట్ ఆడటానికి భాగస్వామ్య దేశాలు నిరాకరిస్తాయని బోర్డు భావిస్తోంది. టోర్నీకి మరికొన్ని నెలల సమయం ఉండటంతో అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఇప్పటికే ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేశారు.