ఆక్సిజన్ సరఫరాపై కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాలను అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. ఢిల్లీ, యూపీ, హర్యానా మధ్య ఆక్సిజన్ సరఫరాపై విభేదాల నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆక్సిజన్ ట్యాంకర్లను ఢిల్లీ ప్రభుత్వం తరలించుకుపోతుందంటూ హర్యానా మంత్రి ఆరోపణలు చేశారు. హర్యానా తమ కోటా ఆక్సిజన్ తీసుకుంటుందని ఢిల్లీ సర్కార్ ఆరోపణలు చేస్తోంది.