ఐపీఎల్ 14వ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ 34 బంతుల్లోనే 66 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన క్లబ్ లో చేరాడు. చెన్నై బౌలర్ శామ్ కరన్ వేసిన ఓవర్లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. ఇలా ఐపీఎల్ లో ఒకే ఓవర్లో 30, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వారి జాబితాలో కమిన్స్ చేరాడు. కమిన్స్ కంటే ముందు క్రిస్ గేల్, సురేశ్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్, షాన్ మార్ష్, రాహుల్ తివాతియా ఒకే ఓవర్లో 30కిపైగా పరుగులు చేశారు. వీళ్లలో గేల్ 36 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత రైనా 32 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మిగతా నలుగురు 30 పరుగులు చేశారు. అంతేకాదు వీళ్లలో గేల్ ఈ ఫీట్ను రెండుసార్లు అందుకోవడం విశేషం. కమిన్స్ ఒకే ఓవర్లో 4 సిక్సర్లు కొట్టడం ఇది రెండోసారి. గతంలో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఒకే ఓవర్లో 4 సిక్సర్లు కొట్టాడు. రెండుసార్లు ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ కమిన్స్. ఇందులో గేల్ (7 సార్లు) తొలి స్థానంలో ఉండగా, హార్దిక్ పాండ్యా(2 సార్లు)తో కమిన్స్ చేరాడు.