లక్నో : యూపీ అసెంబ్లీ జులై 27వరకూ వాయిదా పడింది. ఈ రోజు ఉదయం సమవేశమైన అసెంబ్లీ ఇటీవల మరణించిన ఎమ్మెల్యే మధుర ప్రసాద్ పాయ్ కు సంతాపాన్ని తెలియజేసిన అనంతరం స్పీకర్ సభను జులై 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సికంద్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎన్నికైన మధుర ప్రసాద్ అస్వస్థతతో ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.