సభా కార్యకలాపాలకు విఘాతం కల్పిస్తున్నారన్న కారణంతో కాంగ్రెస్కు చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. ఆరుగురిని అయిదు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండైన వారిలో ఆధిర్ రంజన్ ఛౌదురి, రంజీత్ రంజన్, సుస్మిత దేవ్, గౌరవ్ గగోయ్, కె.సురేష్, ఎంకే రాఘవన్లు ఉన్నారు.
గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై చర్చించాలని ప్రతిపక్షాలు సోమవారం పట్టుబట్టాయి. అయితే భాజపా సభ్యులు మాత్రం బోఫోర్స్ కుంభకోణంపై చర్చించాలని నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంయమనం పాటించాలని సభ్యులను స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. అంతేకాకుండా స్పీకర్ సుమిత్రా మహాజన్పై కాగితాలు చించి విసరడంతో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను అయిదు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.