ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో అద్భుత ప్రతిభ కనబర్చిన క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ కు పంజాబ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పంజాబ్ పోలీసుశాఖలో ఆమెకు ఉద్యోగం ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. కొన్ని సంవత్సరాల క్రితం హర్మన్ ప్రీత్ సింగ్ పోలీస్ శాఖలో ఉద్యోగం చేయాలనుకున్నదని సీఎం చెప్పారు. అయితే.. హర్మన్ ఓ నేషనల్ ప్లేయర్ అయినప్పటికీ నాటి ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించిందని విమర్శించారు. అటు గతంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం అమరీందర్ హర్మన్ ప్రీత్ కు రూ. 5 లక్షల రివార్డును ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 115 బంతుల్లో 171 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి కౌర్.. ఇండియాను ఫైనల్స్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. మార్చి 8, 1989న పంజాబ్ లోని మోగ ప్రాంతంలో కౌర్ జన్మించింది.