తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత స్వామి దర్శనానికి అనుమతిస్తారు. కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు.