కారును వెనుక నుండి లారీ ఢీకొన్న ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. లారీ, కారు రెండు తిరగబడడంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఆస్పత్రికి తరలించారు. లారీ డైవర్ ను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు.