శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబుపై అగ్రహం వ్యక్తం చేశారు. హిందూమతంపై గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు అని వెల్లంపల్లి మండిపడ్డారు. దేవుళ్ళు, స్వామీజీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ ఆధ్యాత్మిక పర్యటనపైన రాజకీయ విమర్శలు చేయడంతో చంద్రబాబు నైజం బయటపడిందన్నారు. దేవాలయాలపై దాడులు నిలిచిపోవడానికి టీడీపీనే కారణం అని చంద్రబాబు అంటున్నారని పేర్కొన్నారు. దీనిని బట్టే అర్ధం అవుతోందని.. గుడులపై దాడులు చేయించింది....ఆపింది తామేనని చంద్రబాబు ఒప్పుకున్నారని వెల్లడించారు మంత్రి వెల్లంపల్లి. నిందితులు పట్టుబడడంతో టీడీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.