ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటికి వాయిదా పడ్డ పార్లమెంట్ ఉభయసభలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 17, 2017, 11:37 AM

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షకాల సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇటవలే మరణించిన మాజీ సభ్యులకు ఉభయసభలు సంతాపం ప్రకటించాయి. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ఉభయసభలు తీవ్రంగా ఖండించాయి. అమర్‌నాథ్ యాత్రికుల మృతుల పట్ల సంతాపం ప్రకటించాయి. లోక్‌సభ సభ్యులు వినోద్ ఖన్నా, అనిల్ మాధవ్ దవే సహా పలువురు సభ్యుల మృతిపట్ల ఎంపీలు సంతాపం తెలిపారు. రాజ్యసబ సభ్యులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, సి నారాయణరెడ్డి, దాసరి నారాయణరావు మృతిపట్ల రాజ్యసభ సంతాపం తెలిపింది. అనంతరం ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com