రాజ్యాంగబద్ధమైన బాధ్యతను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంటే వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని టీడీపీ నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు. ఎన్నికలకు వెళ్లే దమ్ములేక ఒక వ్యక్తిని బూచిగా చూపి వాయిదా వేయాలని కోరుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకతను చూసి వైసీపీ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు తమను తిరస్కరిస్తారనే భయంతో అధికార పార్టీ స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి జంకుతోందని పట్టాభిరామ్ విమర్శించారు.