న్యూఢిల్లి : భారత్లోని చైనా రాయబారితో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. దీనిపై వచ్చిన వార్తలను కాంగ్రెస్ పార్టీ ముందు ఖండించినప్పటికీ తరువాత ఈ వార్త వాస్తవమేనని ప్రకటించింది. చైనా రాయబారితో రాహుల్ సమావేశమయ్యారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా చెప్పారు.