హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీపు కాలువలో పడటంతో ఏడుగురు మృతిచెందారు. మండి జిల్లాలోని పుల్ఘ్రాత్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాతంలో ఓ ట్రాలీ జీపు బ్రిడ్జిపైనుంచి సుకేతీ ఖాడ్ నదిలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతన్ని సమీపంలో దవాఖానకు తరలించారు. ట్రాలీ బ్రిడ్జిపైనుంచి కిందికి పడిపోడంతో అందులో ఉన్న వ్యక్తులు చల్లచదురుగా పడిపోయారు. సమాచారం తెలుసుకున్న వెంటనే సదర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి వినోద్ కుమార్ ఠాకూర్ తో పాటు మొత్తం బృందం సంఘటన స్థలానికి చేరుకుని లోయలో పడ్డ వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీసింది. గాయాలైన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారంతా బీహార్కు చెందిన కార్మికులుగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మండల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.