ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలో తెరచుకున్న ఆలయాలు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 16, 2020, 10:43 AM

మహారాష్ట్రలో సోమవారం నుంచి ప్రార్థనా స్థలాలు తెరుచుకున్నాయి. దీపావళి పర్వదిన పురస్కరించుకుని సోమవారం నుంచి ప్రార్థన స్థలాలు తెరిచేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్‌–19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల గత ఏడు నెలలకుపైగా అలయాలు, వివిధ మతాల ప్రార్థనా స్థలాలన్నీ మూసి ఉన్నాయి. భక్తులు లేక ఆలయ పరిసరాలన్నీ వెలవెలబోయాయి. అయితే సోమవారం నుంచి ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించగానే ఇటు భక్తులు, అటు ఆలయాల సరిసరాల్లో పూలు, పూలదండలు, కొబ్బరి కాయలు, ప్రసాద సామగ్రి విక్రయించే చిరు వ్యాపారుల్లో ఆనందం వెల్లువిరిసింది. మొన్నటి వరకు ఉపాధిలేక ఖాళీగా ఉన్న పేద వ్యాపారులు సంతోషం పట్టలేక బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ ప్రమాదం ఇంకా పొంచి ఉండటంతో కోవిడ్‌ నిబంధనలు, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని సీఎం ఆదేశించారు.  


 


కోవిడ్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆలయాలతోపాటు ముస్లింల మసీదులు, క్రైస్తవుల చర్చిలు, పార్శీల అగేరీ లు ఇలా అన్ని రకాల ప్రార్థన స్థలాలు ప్రభు త్వం ఆదేశాల మేరకు మూసి ఉన్నాయి. కానీ, ఇటీవల వైన్‌ షాపులు, బార్లు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, నాటకాలు ప్రదర్శించే హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచి్చంది. ఇదే తరహాలో ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతివ్వాలని ఉద్ధవ్‌ ఠాక్రేపై సామాన్య ప్రజలు మొదలుకుని వివిధ సామాజిక సంస్థల నుంచి ఒత్తిడి రాసాగింది. దీంతో కరోనా వైరస్‌ తీవ్రత తాజా పరిస్థితులను అధ్యయనం చేసి ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతిస్తామని అప్పట్లో ఉద్ధవ్‌ ఠాక్రే హామీ ఇచ్చారు. చివరకు శనివారం లక్ష్మీ పూజ పర్వదినం సందర్భంగా సోమవారం నుంచి ఆలయాలు తెరిచేందుకు అనుమతించారు. కరోనా విస్తరించకుండా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలు స్వయంగా రూపొందించుకున్నాయి. 


 


షిర్గీలో పాసులుంటేనే అనుమతి


షిర్డీలోని బాబా ఆలయంలోకి పాస్‌లుంటునే అనుమతించాలని ఆలయ సంస్థాన్‌ నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగా భక్తులందరిని కాకుండా రోజుకు ఆరు వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు. పాస్‌లు పొందేందుకు ఆన్‌లైన్‌లో ఏర్పాట్లు చేసినట్లు సంస్థాన్‌ పదాధికారులు తెలిపారు. అదేవిధంగా ముంబైలోని ముంబాదేవి గర్భగుడిలోకి ఒకేసారి కేవలం ఐదుగురు భక్తులను అనుమతించనున్నారు. తోపులాటలు జరగకుండా క్యూను క్రమబద్దీకరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఆలయంలో క్రిమిసంహరక మందులు పిచికారి చేయనున్నారు. ఆ సమయంలో ఆలయం మూసి ఉంచనున్నారు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజేషన్‌ టన్నెల్‌ ఏర్పాటు చేయనున్నారు. భక్తులు తమ చేతిలో ఎలాంటి పూలు, హారాలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు, ఇతర పూజ సామగ్రి పల్లెంతో రావొద్దని ఆలయ మేనేజర్‌ హేమంత్‌ మహాజన్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభాదేవిలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయం, పండరీపూర్‌లోని విఠల్, రుక్మాయి మందిరం, కొల్హాపూర్‌లోని తుల్జాభవాని మాత తదితర ఆలయాల యాజమాన్యాలు ఏర్పాట్లు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. కరోనా వైరస్‌ విస్తరించుకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com