విశాఖపై వైసీపీ అమిత ప్రేమ ఒలకబోస్తోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం జగన్ చేసిన ప్రతిపాదనలు అవగాహన రాహిత్యంతో చేసినవేనని తప్పుబట్టారు. 14 నెలలుగా ఏ ప్రాజెక్టులపైనా రివ్యూనే చేయలేదని విమర్శించారు. కేంద్రం వద్ద ఏ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయో జగన్కు తెలియదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ప్రతిపాదించిన కీలక ప్రాజెక్ట్లను.. అడగడానికి జగన్ ఎందుకు వెనుకాడారు? అని సత్యనారాయణ ప్రశ్నించారు. కాలయాపన కోసమే సింహాచల భూసమస్యపై కమిటీ అంటున్నారన్నారు. ప్రారిశ్రామిక వేత్త అదానీని కలిసినపుడు డేటా సెంటర్ గురించి ఎందుకు అడగలేదు? అని బండారు సత్యనారాయణ ప్రశ్నించారు.