ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లాలో దారుణం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 22, 2020, 11:51 AM

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలో ఓ వివాహిత కిడ్నాప్ అయింది. విజయవాడ కు చెందిన వైశ్య యువతిని గుంటూరుకు చెందిన ఎస్సీ యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. జూలై నెలలో ఈ కులాంతర వివాహం దిలీప్ - సౌమ్యలు చేసుకున్నారు. అయితే పెళ్ళి చేసుకున్న నాటి నుంచి యువతి -యువకుడికి తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్టు చెబుతున్నారు.
నల్గొండ ప్రణయ్-అమృత విషయం గుర్తు ఉందిగా అంటూ యువతి కుటుంబీకులు హెచ్చరికలు జారీ చేసినట్టు చెబుతున్నారు. ప్రణయ్ మాదిరిగా హత్య చేస్తామని యువతి తల్లిదండ్రులు బెదిరించినట్టు తెలుస్తోంది. అరండల్ పేట సిఐతో సదరు యువకుడుకి తీవ్ర స్థాయిలో బెదిరించినట్టు చెబుతున్నారు. ఆ యువకుడి ఇంట్లో ఉన్న యువతిని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లినట్టు చెబుతున్నారు. అడ్డువచ్చిన యువతి అత్తని కొట్టి యువతిని పోలీసులు లాక్కెళ్లినట్టు సదరు యువకుడు చెబుతున్నాడు. తనకు ప్రాణహానీ ఉందని ఎస్పీని ఆ యువకుడు ఆశ్రయించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com