ఏపీలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పరీక్ష ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొలిరోజు ఆదివారం ఉదయం, మధ్యాహ్నాం కలిపి మెుత్తం 6.81 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం పరీక్ష రాసే వారికోసం 2221 పరీక్ష కేంద్రాలు..మధ్యాహ్నాం 1068 కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. 14 రకాల ఈ పోస్టుల కోసం ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకూ రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి మెుత్తం 77,558 మంది సిబ్బంది పరీక్షలను పర్యవేక్షించనున్నారు. ఇకపోతే పరీక్షల అనంతరం ఓఎంఆర్ షీట్లు..ప్రశ్నాపత్రాలు ఉంచేందుకు 13 జిల్లాల కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.