మంగళగిరి పరిధిలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైస్సెస్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం సందర్శించారు. అమరావతి పర్యటనలో భాగంగా తుళ్లూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను పరిశీలించిన అనంతరం ఏయిమ్స్ ఆసుపత్రిని పరిశీలించారు. ఇది 2021 నాటికి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు. నిర్మాణంలో ఉన్న కళాశాల భవనాలను, హాస్టల్ భవనాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాతురి నాగభూషణం, కంకణాల శివ, జగ్గారపు రాము, శ్రీనివాసరావు, కొండా నవనీత్ కృష్ణారెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.