ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. పదిహేనేళ్ల మైనర్ బాలికపై పాత సింగరాయకొండ బాలిరెడ్డి నగర్కు చెందిన యుగంధర్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలికను ఆరు నెలలుగా బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత కొద్దికాలంగా యుగంధర్ వద్ద బాలిక పనిచేస్తోంది. బాలిక ఆరోగ్యం బాగోలేక పోవడంతో తల్లితండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. బాలికపై అత్యాచారం జరిగిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం క్రింద యుగంధర్, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.