భారత మాజీ రాష్ట్రపతి, ప్రణబ్ ముఖర్జి మరణంతో భారత రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రణబ్ముఖర్జి ఎపðడూ పార్టీ రాజకీయాల కంటే దేశ ఉన్నతికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారని శివరాజ్సింగ్ గుర్తు చేసుకున్నారు. తన తరఫున, మధ్యప్రదేశ్ ప్రజలు అందరి తరఫున ప్రణబ్ మృతికి సంతాపం తెలుపుతున్నానని ఆయన చెప్పారు.