కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం మండల కేంద్రంతో పాటు యల్లావత్తుల, కోటకొండ, ఆలమూరు, నర్సాపురం తదితర గ్రామాల్లో ప్రజలు మొహర్రం వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పీర్ల చావిళ్ల వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరింజేలా ముజావర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా శనివారం భక్తులు చావిళ్ల వద్దకు వెళ్లి పీర్లకు ఫాతేహాలు సమర్పించారు. ఆదివారం పెద్ద సరిగెత్తు నిర్వహిస్తామని పీర్ల చావిళ్ల నిర్వాహకులు తెలిపారు. .