కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ట్యాంక్ బాండ్ రోడ్ లో ఓ బ్యాచిలర్ రూమ్ లో అనుమాస్పద స్థితిలో గొల్ల ఈరన్న(46) అనే వ్యక్తి మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈరన్న ఆదోని లోని డిప్యూటీ deo కార్యాలయం లో విధులు నిర్వహించేవారు అని తెలిపారు.నిన్నటి రోజు నుండి ఇంటికి రాకపోవడం తో బంధువులు వెతుకుతుండగా ఈరోజు రూమ్ లో శవమై కనపడటం తో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుములున్నాయి.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ లు ప్రసాద్,వెంకట రాముడు తెలిపారు.