ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి ఎప్ప‌టికీ ప్రోత్స‌హించ‌రు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 28, 2020, 09:50 PM

అసాంఘిక కార్యకలాపాలను కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం రాజకీయ జీవితంలో ఎప్పుడూ  ప్రోత్సహించలేద‌ని జడ్పిటిసి సభ్యులు రైల్వే కాంట్రాక్టర్ బి. విరుపాక్షి అన్నారు. శుక్రవారం ఆయన స్వగృహంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2019 ఎన్నికల నుండి మంత్రి ఆలూరులోనే నివాసముంటున్నారు. వారి సొంత ఊరు గుమ్మనూరు గ్రామంలో ఎవరో నిర్వహించే పేకాట నిర్వహణపై వారి ప్రమేయం ఉందనడం నిజం కాద‌న్నారు.మంత్రి జయరాం దాదాపు 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా మంత్రి ఎక్కడ కూడా ఆ సాంఘిక కార్యకలాపాలకు గానీ , ఫ్యాక్సనిజాన్ని గాని ప్రోత్సహించ లేదన్నారు. ఆయన రాజకీయ జీవితంలో మండల‌మంతా కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొందన్నారు. ఆయన ఎదుగుదలను చూసే కొన్ని దుష్ట శక్తులు అనవసరంగా రాద్ధాంతం చేయడం తగదన్నారు. కొన్ని చానల్స్ పనిగట్టుకొని మంత్రి  పేరు మీద లేనిపోని అవాస్తవాలు చెప్పడం స‌రికాద‌న్నారు. ఆయన ఒక బీసీ నేతగా , మంత్రిగా ఎదగడం కొంతమంది పెద్దలకు రుచించడం లేదన్నారు. ఈ సమావేశంలో వైసిపి కో కన్వీనర్ లోకనాథ్, మాజీ ఎంపిటిసి మల్లికార్జున పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com