ప్రియుడితో కలిసి రిసార్టుకు వెళ్లిన యువతి అతడితో ఆనందంలో మునిగి తేలింది. వారిని గమనించి కొందరు యువకులు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని అనేకసార్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన హర్యానాలోని గురుగ్రామ్లో చోటుచేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు.. గురుగ్రామ్కు చెందిన యువతి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతోంది. మూడు నెలల క్రితం బాయ్ఫ్రెండ్తో ఓ రిసార్టుకు వెళ్లింది. అక్కడ ఓ గదిని ఆ ప్రేమ జంట అద్దెకు తీసుకున్నారు. గదిలో జరిగే తతంగాన్ని కిటికీలో నుంచి చూసిన రూపేష్, శంకర్, రాజా అనే యువకులు దాన్ని రహస్యంగా సెల్ఫోన్లో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియోను యువతికి పంపి ముగ్గురు యువకులు దాన్ని సోషల్మీడియాలో పెడతామని బెదిరించి అనేకసార్లు సామూహికంగా అత్యాచారం చేశారు.
ఆ వీడియో బయటపడితే కుటుంబ పరువు పోతుందని భావించిన యువతి వారు పిలిచినప్పుడల్లా వెళ్లి ఆ కామాంధుల చేతిలో నలిగిపోయింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.