బెంగళూరు :పరప్పన జైలులో తనకు ప్రాణాహాని ఉందని ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. జైలులో వాతావరణం కూడా తనకు సరిపడటం లేదని ఆమె పేర్కొన్నారు. తనను చెన్నై సెంట్రల్ జైలుకు తరలించాలని శశికళ విజ్ఞప్తి చేస్తూ ఒక పిటిషన్ను జైలు అధికారులకు ఇచ్చారు. శశికళ పిటిషన్ను జైలు అధికారులు పరిశీలిస్తున్నారు. చెన్నై సెంట్రల్ జైలుకు లేఖ రాయాలని పరప్పన జైలు అధికారులు భావిస్తున్నారు. కాగా అక్రమాస్తుల కేసులో సుప్రీం న్యాయస్ధానం ఇచ్చిన తీర్పు మేరకు బెంగళూరులోని పరప్పన జైలులో శశికళ శిక్ష అనుభవిస్తున్న సంగతి విధితమే.