కర్నూలు జిల్లా ప్యాపిలి పట్టణ సమీపంలోని కొత్తచెరువుకు సంబంధించిన ఆనకట్టను ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం విధితమే. దీంతో దాదాపు పది సంవత్సరాల తర్వాత నిండిన చెరువు ఆనకట్ట ధ్వంసం కావడంతో నీరు వృథాగా పోతోంది. అయితే చెరువు నీరు వృథాగా పోతుండటంతో స్పందించిన స్థానిక వైసిపి నాయకులు బొర్రా మల్లికార్జున రెడ్డి ఆనకట్ట దెబ్బతిన్న చోట ఇసుక బస్తాలు వేసి నీటి వృథాను అరికట్టారు. తాత్కాలికంగా నీటి వృథాను అరికట్టేందుకు ఇసుక బస్తాలను వేసినట్లు ఆయన తెలిపారు. చెరువులో నీటిమట్టం తగ్గిన తర్వాత మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా ఆనకట్టకు మరమ్మత్తులు చేపడతామని ఆయన తెలిపారు.