చెన్నై: తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పళనిస్వామి సెక్రటేరియట్కు వెళ్లారు. ఐదు ఫైళ్లపై సంతకం చేశారు. వర్కింగ్ ఉమెన్స్కు 50 శాతం సబ్సిడీపై టూవీలర్స్, మెటర్నిటీ సాయం రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంపు, 500 మద్యం దుకాణాలు మూసివేత ఫైల్పై సీఎం సంతకం చేశారు. మత్సకార కుటుంబాలకు 5 వేల ఇళ్లు మంజూరు చేశారు. కార్మికుల మూల నిధి పెంపుపై పళనిస్వామి సంతకం చేశారు.