కట్టుకున్న భార్యనే కిడ్నాప్ చేసిన ఓ దుర్మార్గుడు స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించి దారుణానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్లో ప్రభుత్వ అంబులెన్స్ సేవల విభాగంలో పని చేస్తున్న వ్యక్తికి 2016లో అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దికాలానికే ఆమెకు వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆమెతో భర్త నిత్యం గొడవపడి కొడుతూ దారుణంగా హింసించేవాడు. 2018లో ఆమె గర్భం దాల్చింది. కడుపుతో ఉందన్న కనీస కనికరం కూడా లేకుండా ఆ దుర్మార్గపు భర్త తీవ్రంగా కొట్టడంతో ఆమెకు గర్భస్రావమైంది. దీంతో భర్త వేధింపులు ఇక తట్టుకోలేనని భావించి అతడికి దూరంగా ఉంటోంది. తన గర్భం పోవడానికి భర్తే కారణమని కేసు పెట్టింది. దీంతో ఇద్దరికీ అధికారులు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే గత నెల 24న కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చిన భార్యని ఆ భర్తే కిడ్నాప్ చేశాడు. గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి కట్టేసి దారుణంగా రేప్ చేశాడు. అంతటితో ఆగని దుర్మార్గుడు తన ముగ్గురు స్నేహితులో గ్యాంగ్ రేప్ చేయించాడు. మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు నరకం చూపాడు. తర్వాత బాధితురాలిని జహనాబాద్ సమీపంలోని షాహి రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్ మీద పడేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో ఎలాగో బయటపడ్డ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఆ దుర్మార్గులను అరెస్టు చేశారు.