ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించారు. 3 వారాల క్రితం దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. దానికి గవర్నర్ నేడు ఆమోదం తెలిపారు. దీంతో న్యాయ రాజధానిగా కర్నూల్,శాసన రాజధానిగా అమరావతి,ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాజధానిగా విశాఖపట్నం ఉండనున్నాయి. అదే విధంగా సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో శాసన ప్రక్రియ పూర్తయ్యిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శాసన సభలో ఈ బిల్లులు ఆమోదం తెలిపాయి. శాసనమండలిలో ఈ బిల్లులకు ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం శాసనమండలి ఆమోదం లేకుండానే గవర్నర్ కు బిల్లులు పంపింది. వీటికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇక ఏపీకి 3 రాజధానులు ఉండనున్నాయి. దీని పై ప్రతిపక్ష టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అదే విధంగా ప్రభుత్వం విశాఖకు రాజధానిని తరలించేందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయనుంది.